రాజమహేంద్రవరం ఆశ్రమం లో మహా శివరాత్రి, మహిళా దినోత్సవం సందర్భంగా సభ నిర్వహించబడినది | 8th March 2024

ప్రెస్ నోట్ రాజమహేంద్రవరం 8-3-24
శివ తత్వం దైనందిన జీవితంలో అలవర్చుకొనుట ద్వారా మానవ జీవన విధానం సుఖమయం చేసుకోవచ్చని పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి అనుగ్రహ భాషణ చేశారు. రాజమహేంద్రవరం స్థానిక గౌతమి ఘాట్ లో ఉన్న శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహా శివరాత్రి, మహిళా దినోత్సవం సందర్భంగా పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా ప్రసంగించారు.మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధికారత మహిళా చైతన్యం ద్వారా సాధించ వచ్చని డా.ఉమర్ ఆలీషా స్వామి అన్నారు.పీఠం లో సీనియర్ మహిళా మణులు స్వామి వారిని శాలువా తో సత్కరించగా, పురుషులు గజ మాల తో సత్కరించారు. స్థానిక కన్వీనర్ శ్రీ D.కృష్ణం రాజు, శ్రీ MRK రాజు, శ్రీ పుల్లా కల్కి మూర్తి, శ్రీ శ్రిధరాల రాజా, శ్రీ తోట వెంకటేశ్వర రావు , శ్రీ కూసుమంచి రామ్ కుమార్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇట్లు
శ్రీ D. కృష్ణంరాజు,
స్థానిక కన్వీనర్,
9642872425.

You may also like...