12 అక్టోబర్ 2024 తేదీన కోనసీమ జిల్లా మురమళ్ల గ్రామం లో కొలువై ఉన్న శ్రీ విజయ దుర్గా పీఠాన్ని డా. ఉమర్ ఆలీషా స్వామి వారు దర్శించుకున్నారు

12-10-24 కోనసీమ జిల్లా మురమళ్ల గ్రామం లో కొలువై ఉన్న శ్రీ విజయ దుర్గా పీఠాన్ని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, పిఠాపురం పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు దర్శించుకున్నారు. వీరితో పాటు వారి సోదరుడు అహ్మద్ ఆలీషా గారు, పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు, శ్రీ రేఖా ప్రకాష్, శ్రీ సత్యనారాయణ గారు కూడా స్వామి వారితో పాటు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విజయ దుర్గా పీఠం నిర్వాహకులు శ్రీ బాణాల దుర్గా ప్రసాద్ మరియు వారి సోదరుడు, తల్లితండ్రులను మరియు ఇతర గ్రామ పెద్దలు అందరూ ముందుగా స్వామి వారికి శాలువలు కప్పి సన్మానించగా, స్వామి వారందరికీ శాలువలు, ప్రసాదం పంపిణీ చేశారు.
ఇట్లు
శ్రీ పేరూరి సూరిబాబు, పీఠం కన్వీనర్.

You may also like...